Thursday, 30 July 2026 03:13:23 AM
# గురు పౌర్ణమి వేడుకలలో పాల్గొన్న వనమా రాఘవేంద్రరావు # పాల్వంచ యువకుడు అదృశ్యం # సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ

అయ్యప్ప స్వాములకు ముస్లిం యువకుడి అన్నదానం

Date : 01 December 2024 01:55 PM Views : 1400

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నేటికీ కొందరు కులమతాల కోసం కొట్టుకుని చస్తుంటారు. రక్త పాతాలకు పాల్పడుతుంటారు. ఒకరంటే ఒకరికి ద్వేషం కలిగి ఉంటారు. అయితే ప్రజలను కులమతాల పేరుతో విభజించి రాజకీయ పబ్బం గడుపుకునే పొలిటికల్ లీడర్స్ ఉన్నన్ని రోజులు ఈ దేశంలో ఈ వైషమ్యాలు తొలగిపోవని కొందరు మేధావులు చెబుతున్నారు. అయితే మనదేశంలో చాలా ఏండ్ల కిందట నుంచే హిందువులు, ముస్లిములు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. ఒకరి పండుగలకు ఒకరు హాజరవడమే కాకుండా సంతోషంగా జరుపుకుంటుంటారు. అందుకు నిదర్శనమే ఈ ఘటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని బసవతారక కాలనీ హనుమాన్ టెంపుల్ లో శనివారం అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు. గురు స్వామి జర్పుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పాల్వంచకు చెందిన ముస్లిం భక్తుడు ఖలీష్ కుల,మతాలకు అతీతంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంతకుముందు కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. హిందూ,ముస్లిం భాయి భాయి అనే పదానికి ప్రతీకగా ఈ యువకుడు నిలిచాడని పాల్వంచలో ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలదారులు రాపోలు ఆనంద్, ఆకుల హరికృష్ణ, రాపోలు శ్రీశైలం, హెచ్.మధు, పజిల్, సందీప్, కిరణ్, గిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: