Friday, 31 July 2026 04:32:58 AM
# చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ # గురు పౌర్ణమి వేడుకలలో పాల్గొన్న వనమా రాఘవేంద్రరావు # పాల్వంచ యువకుడు అదృశ్యం # సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్

గట్టికల్లులో మెగా రక్తదాన శిబిరం

Date : 09 November 2024 07:26 PM Views : 1570

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని గట్టికల్లు గ్రామంలో శనివారం మద్యపాన నిషేధ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సూర్యాపేట డిఎస్పీ రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా గట్టికల్లు లో మద్యపానం నిషేధం ప్రారంభించి గ్రామస్తులంతా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారని డిఎస్పీ రవి అభినందించారు. సమస్యాత్మక గ్రామంగా ఉన్న గట్టికల్లు రాబోయే ఎన్నికలలో శాంతియుత గ్రామంగా చేస్తామని డిఎస్పీ ప్రకటించారు. అనంతరం గ్రామ యువజన సంఘాలకు చెందిన యువకులు, గ్రామస్తులు రక్తదానం చేశారు. రాజకీయాలకతీతంగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మద్యపాన నిషేధం బాటలో పరిసర గ్రామాలు నడుస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. రక్తదానంతో మరొకరికి పునర్జన్మ ఇవ్వవచ్చని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాపాయంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని అన్నారు. రక్తం అందక ప్రతి రోజూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, యువకులు రక్త దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  అనంతరం గ్రామ మద్యపాన నిషేధ శాఖ కమిటీ, యువజన సంఘాలు డిఎస్పీ రవి, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నాయకులు బైరు వెంకన్నగౌడ్, ఆత్మకూర్ (ఎస్) SI శ్రీకాంత్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత భూపతి రాములును, సొంత ఖర్చులతో గ్రామంలోని రోడ్లను మరమ్మతులు చేసిన సంద్యాల నాగార్జునను డిఎస్పీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ మండల బాధ్యులు దండా వెంకటరెడ్డి, దొంతగాని కరుణాకర్ గౌడ్, గంపల కృపాకర్, గుగులోత్ గణేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: